KDP: రాజుపాలెం(M) కొర్రపాడులో శుక్రవారం ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. NSS ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇందిర ఆధ్వర్యంలో గైనకాలజీ, మెడిసిన్, ఆపరేషన్ ఇతర 40 కేసులకు సంబంధించి చికిత్సలు అందించారు. పశువుల వ్యాధి నివారణకు డీ-వార్మింగ్, డీ-టికింగ్ నిర్వహించారు. పశుపోషణ, వ్యాధులపై, చికిత్సలపై రైతులకు అవగాహన కల్పించారు.