ASR: జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకులు ఆర్.హేమంత్ కుమార్ బుధవారం పాడేరు వచ్చారు. పాడేరు పీఎంఆర్సీ అతిథి గృహంలో ఆయనను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో చేపడుతున్న శాంతిభద్రతల పరిరక్షణ, అవగాహన కార్యక్రమాలపై కలెక్టర్ వివరించారు.