అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం పత్తికుంట వారిపల్లి గ్రామానికి చెందిన రాఘవ నరసరాజు పొలంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. టీడీపీ ఇంచార్జ్, KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.