ELR: జీలుగుమిల్లి మండల కేంద్రంలో నిర్మాణం కాబోతున్న అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి నిర్మాణ పనుల వివరాలను తెలుసుకుని పనులు వేగవంతం చేయాలని సూచించారు. అన్నా క్యాంటీన్ పూర్తయ్యాక ప్రతి రోజు వందలాది మంది పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందుతుందని తెలిపారు.