ASR: అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సలుముర్తి సూరిబాబు డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కొయ్యూరులో అంగన్వాడీలు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. అంగన్వాడీల ధర్నాకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని అన్నారు.