ATP: టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఆయన, సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం సామాన్యులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.