సత్యసాయి: కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద సుమారు రూ.20 లక్షల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టారు. పాఠశాల రక్షణకు ప్రహరీ గోడ ఎంతో అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.