ATP: కనగానపల్లి మండల కేంద్రంలోని రెడ్డివారికుంట చెరువు మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. 2024 భారీ వర్షాలకు తెగిపోయిన ఈ చెరువుకు రూ. 86 లక్షల డీఎంఎఫ్ నిధులు కేటాయించారు. గత నెల 17న పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం జరుగుతున్న తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు.