గార్లదిన్నె మండలం కృష్ణాపురంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అంగన్వాడీ కేంద్రానికి సరఫరా అవుతున్న కోడిగుడ్లను పరిశీలించారు. చిన్న పరిమాణంలో ఉన్న గుడ్లను గమనించి, నాణ్యమైనవి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులతో మాట్లాడారు.