KRNL: విజయవాడలో TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును జిల్లా TDP అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత బలోపేతం, స్థానిక సమస్యలు, రాబోయే కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. గ్రామ స్థాయి కమిటీలను చురుకుగా మార్చడం, నాయకులు–కార్యకర్తల సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు.