ELR: జీలుగుమిల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలికల పాఠశాల వసతి గృహాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలన జరిపిన ఆయన, ముఖ్యంగా భోజన వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారు. వసతి గృహంలో విద్యార్థినులకు అందించే ఆహారం మెనూ ప్రకారం సరైన విధంగా అందుతున్నదా లేదా అని పరిశీలించారు.