E.G: కందుకూరి వీరేశలింగం పంతులు 178వ జయంతి వేడుకల్లో తూ.గో జిల్లా వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ నల్లమిల్లి సుబ్బారావు హాజరయ్యారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. నవీన సమాజానికి బాటలు వేసిన సంఘసంస్కర్త, రచయిత కందుకూరి వీరేశలింగం అని కొనియాడారు. ఈ వేడుకల్లో కోడూరి శాంతారామ్, మాజీ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ బూరగడ్డ పాల్గొన్నారు.