ప్రకాశం: సీఎం చంద్రబాబు దోర్నాల మండలంలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల శంఖస్థాపన, మార్కాపురం బహిరంగ సభ పర్యటన సందర్భంగా కనిగిరి టీడీపీ కార్యాలయంలో ప్రముఖ నేతలు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని మండల పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.