SKLM: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. నరసన్నపేట మండలంలోని దేవాది-మబగాం రోడ్డు నుంచి కిళ్లాం వరకు రూ.కోటితో నిర్మించిన సిమెంట్ రోడ్డును సోమవారం ప్రారంభించారు. కూటమి పాలనలో ప్రతి పల్లె అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త అర్చన, తదితరులు పాల్గొన్నారు.