ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం మెయిన్ గేటు వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జడ్పీ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.