GNTR: మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో గురువారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. మౌలిక వసతుల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సూచించారు.