TPT: ముగ్గురు SV శిల్పకళాశాల విద్యార్థులు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కలంకారి వర్క్షాప్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 16 నుంచి 26 వరకు జరిగిన ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 21 మంది ప్రముఖ కళాకారులు పాల్గొనగా.. అందులో SV శిల్పకళాశాల పూర్వ విద్యార్థులు ఏ.ధనుంజయ్, పి.భాను ప్రకాష్, సి.మధు పాల్గొని ప్రతిభ చాటారు. రాష్ట్రపతి వారిని మెమెంటోతో సత్కరించారు.