NLR: పరిపాలన పరిశీలనలో భాగంగా బుధవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆత్మకూరు మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని బోయళ్ల చిరువెళ్ల, దేపూరు గ్రామాలలో పర్యటించి నబ్బినగరం వద్ద ఉపాధి హామీ పనులను పరిశీలిస్తారు. అనంతరం బోయళ్ల చిరువెళ్ల గ్రామంలో హెల్త్ క్లినిక్, పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తారు. దేపూరు గ్రామ విజిటింగ్లో భాగంగా గ్రామసభలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.