W.G: గొంది గ్రామంలో జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. జనసేన సభ్యత్వం తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకి రామ్, పాలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి సునీల్ పాల్గొన్నారు.