MNCL: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన రాములుని బెల్లంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్ శుక్రవారం సన్మానించారు. ఈ సందర్బంగా బెల్లంపల్లిలో భూ కబ్జాల పైన, బోగస్ ఆహార భద్రత కార్డులపై దర్యాప్తు జరపాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.