తూ.గో: నవ జనార్ధన ఆలయాల్లో ప్రముఖమైన ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి వారి ఆలయాన్ని గురువారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ పాలకమండలి ఛైర్మన్ బైరిశెట్టి రాంబాబు స్వాగతం పలికారు. స్వామి వారిని ఎమ్మెల్యే బత్తుల దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.