KMR: పట్టణంలోని బస్తీ దవాఖానను మంగళవారం DM&HO డా.రవీందర్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్తీ దవాఖానా ద్వారా ప్రజలు పొందుతున్న సేవల వివరాలపై సిబ్బందిని అడిగి ఆరా తీశారు. ఫార్మసీ ల్యాబ్ తదితర గదులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలన్నారు.