W.G: నరసాపురం టౌన్ వీధి వ్యాపారుల నుంచి పన్ను వసూలు చేసుకునే ఆశీలు వేలం పాట ఖరారైందని పురపాలక కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన భూపతి సురేష్ అత్యధికంగా రూ.50.40లక్షల హెచ్చుపాటకు పాడి పన్ను వసూలు హక్కు సొంతం చేసుకున్నారు. పశువధ శాలల పన్ను వసూలుకు ముస్కుడి సాల్మన్ రూ.15,500లు హెచ్చు పాటకు పాడినట్లు తెలిపారు.