సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ 62 అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.