KMM: ఖమ్మం అదనపు కలెక్టర్ పి. శ్రీజ సింగరేణి మండలంలోని విద్యాసంస్థల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న సివిల్ పనులను తనిఖీ చేసి, వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం SSC పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, విద్యార్థులకు కల్పించిన వసతులను సమీక్షించారు.