MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్ హనుమాన్ ఆలయంలో ఆదివారం నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణము కార్యక్రమంలో మాజీ DCC అధ్యక్షురాలు కే.సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.