MDCL: కీసర అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 211వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని అధ్యక్షుడు కర్రె గణేశ్ ప్రధాన కార్యదర్శి మంచాల సంజీవ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ గౌడ సంఘం నాయకుడు వనందాస్ లక్ష్మి నారాయణ గౌడ్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కీసర గ్రామశాఖ అధ్యక్షుడు తుడుం బాలరాజ్ పాల్గొన్నారు.