KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఏప్రిల్ 1న రాష్ట్ర స్థాయి గుర్రం పరుగు పందేలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. చేబ్రోలు శివారునున్న ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ నివాసం పక్కనున్న అడవిపుంత మార్గంలో పందేలు జరుగుతాయన్నారు. సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని పందేలు ఏర్పాటు చేశామన్నారు.