GDWL: ఇంటర్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిపాదిత కళాశాలల కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం గద్వాలలో ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలల్లో పరీక్షల ఏర్పాటు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.