PKSM: కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కంగారు మదర్ కేర్ (KMC), డయాలసిస్ సెంటర్ను గురువారం రాత్రి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రోగులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలపై ఆయనకు వివరించారు. ఆసుపత్రి సిబ్బందికి మెరుగైన సేవలు అందించాలని సూచనలు చేశారు.