ప్రకాశం: టంగుటూరు మండలంకొణిజేడులో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మోజస్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలలో ఉన్న సమస్యలను అధ్యయనం చేసే కార్యక్రమంలో భాగంగా బుధవారం సందర్శించారు. ఇప్పటికీ ఈ కాలనీలు అభివృద్ధి కాలేదని, 30 ఎస్టీ కుటుంబాలకు పక్కా గృహాలు సైతం లేవన్నారు. గ్రామంలోని రెండు దళిత కాలనీలకు స్మశాన స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించామన్నారు.