నెల్లూరు 10వ డివిజన్, ఉస్మాన్ సాహెబ్ పేటలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు మార్చి 28 నుంచి ఏప్రిల్ 7 వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 3న స్వామివారి కళ్యాణం, ఏప్రిల్ 4న రథోత్సవం ప్రధాన ఘట్టాలుగా నిర్వహించనున్నారు.