PLD: రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో దుర్గి మార్కెట్ యార్డ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వివరించారు.