సత్యసాయి: ముదిగుబ్బ మండలంలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి మృతి చెందడంతో తల్లి వద్ద ఉంటున్న బాలికపై బంధువైన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా బాలిక గర్భవతి అని తేలింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది. కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.