AP: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూముల వ్యవహారంలో గతంలో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన మాజీ MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అప్పట్లో ఆయన చేసిన ఫిర్యాదులపై సరైన సాక్ష్యాధారాలు లేవని సీఐడీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో, ఈనెల 27న విజయవాడ ఏసీబీ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.