నంద్యాల: నందికొట్కూరు పట్టణంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య, సింగిల్ విండో ఛైర్మన్ మృతుజావలి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు సూరి, తదితరులు పాల్గొన్నారు.