రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామానికి చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ పెంపెట్ల మణికుమార్ను తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేట్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు శనివారం జిల్లా రెవెన్యూ అధికారి టీ. సీతారామ మూర్తి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పెంపెట్ల మణికుమార్ ఎంపిక కావడం పట్ల పలు ప్రజా సంఘాల నేతలు, పలువురు సామాజికవేత్తలు అభినందిస్తున్నారు.