KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల పలు దశల్లో కొనసాగుతుంది. యాసంగి పంటల కోసం గురువారం 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా 28 క్యూసెక్కులు నీరు ఆవిరిగా మారుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు యాసంగికి 0.674 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.