KMR: పల్వంచ మండలం భవానిపేట్ గ్రామానికి చెందిన పలువురు CITU నాయకులు ఆ సంఘానికి రాజీనామా చేసి, మంగళవారం తెలంగాణ బహుళ బీడీ కార్మిక సంఘంలో చేరారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన నిలిచి పోరాటం చేస్తామని, వారి హక్కులను కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య ఉన్నారు.