ప్రకాశం: సింగరాయకొండ మాగుంట సుబ్బరామిరెడ్డి ఫ్యాక్టరీ సమీపంలో గురువారం జాతీయ రహదారిపై గ్రానైట్ బండల రోడ్డుకి అడ్డంగా పడ్డాయని ఎస్సై మహేంద్ర తెలిపారు. బల్లికురవలోని కాశిరెడ్డి క్వారీ నుంచి గ్రానైట్ బండలను బెంగళూరు తీసుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఎస్సై మహేంద్ర తెలిపారు.