NTR: విస్సన్నపేట మండలంలో ఎంపీ కేశినేని చిన్ని శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు. టీడీపీ కార్యాలయం వద్ద ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను మండల పార్టీ నాయకులతో కలిసి ఎంపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.