E.G: గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులకు ఇవాళ శంకుస్థాపన జరిగింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన నిధుల నుంచి రూ. 30 లక్షలు కేటాయించగా, సూరంపాలెం ప్రాజెక్టు ఛైర్మన్ ఉంగరాల రాము కొబ్బరికాయ కొట్టి ఈ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.