తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో శనివారం (రేపు) 22వ కాన్వకేషన్ నిర్వహించనున్నారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా మొత్తం 1,601 మంది విద్యార్థినులకు డిగ్రీ పట్టాలు అందజేయనున్నారు.