BDK: అశ్వరావుపేట మండలం దురదపాడు గ్రామ శివారులో కోడిపందేలు ఆడుతున్న స్థావరంపై ఇవాళ తెల్లవారుజామున పోలీసులు మెరుపు దాడి చేశారు. రహస్య సమాచారంతో దాడులు నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు. వారి నుంచి రూ. 15,080 నగదు, 2 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.