సత్యసాయి: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే నిజమైన హీరోలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన మండల కమిటీ సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.