TG: HYD అంబర్ పేట ఫ్లై ఓవర్ కింద నిలిచిపోయిన సర్వీస్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. భూ సేకరణలో ఎదురవుతున్న అడ్డంకుల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రూ. 265 కోట్ల వ్వయంతో 1.5 కిలోమీటర్లు పొడవైన 4 వరుసల ఫ్లై ఓవర్ ను కేంద్రం నిర్మించిందని గుర్తు చేశారు.