పశ్చిమాసియాలో యుద్ధంతో అంతర్జాతీయంగా ఇంధన కొరత ఏర్పడిన క్రమంలో దాని దుష్ప్రభావాలను భారత్ సైతం ఎదుర్కొంది. ఇకపై భారత్ ఎక్కువగా ఎగుమతులపై ఆధారపడకూడదని భావించి ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో కూడిన ఈ-85ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.