బాపట్ల: సంతమాగులూరు మండల పరిధిలోని ఏల్చూరి గ్రామంలో నిర్వహించాల్సిన చేపల చెరువు బహిరంగ వేలం వాయిదా పడింది. అధికారులు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వేలం నిర్వహించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల దీనిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వేలం నిర్వహణకు సంబంధించి తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.