W.G. ఇరగవరం మండలం తూర్పు విప్పర్రులో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచాను ఎస్సై జానా సతీష్ గురువారం స్వాధీనం చేసుకున్నారు. నారాయణపురం గ్రామానికి చెందిన మామిడిశెట్టి శ్రీను తూర్పువిప్పర్రులో గోనెసంచుల ఫ్యాక్టరీలో బాణసంచా అక్రమంగా నిల్వ ఉంచినట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడి చేశారు. సుమారు రూ.30,000 విలువ చేసే బాణా సంచాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.