BPT: పిట్టలవానిపాలెం మండలంలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. చందోలు ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో వాహనదారుల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.